సూపర్వైజర్లపై దాడికి దిగిన మానేసర్ వర్కర్లు
మారుతి సుజుకి మానేసర్ ప్లాంటు కార్మికుల సమ్మె ఉద్రిక్తలకు దారీ తీసింది. గడచిన 17 రోజులగా శాంతియుతంగా సమ్మె చేస్తున్న మానేసర్ కార్మికులు నేడు కోపోద్రిక్తులై కంపెనీ సూపర్వైజర్లపై దాడికి దిగారు. డ్యూటీ వెళ్లేందుకు ప్లాంటు వైపు వెళ్తున్న కార్మికులపై సమ్మె చేస్తున్న మానేసర్ కార్మికులు దాడిచేశారు. వారిలో ఐదుగులు సూపర్వైజర్లు గాయాలతో బయటపడ్డారు.
గుడ్ కండక్ట్ బాండ్పై సంతకం చేయని ప్రస్తుత శాశ్వత కార్మికుల స్థానంలో కొత్త వారిని మారుతి యాజమాన్యం నియమించుకోవడం పట్ల ఆగ్రహం చెందిన కార్మికులు ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. ప్లాంటులోనికి 11 మంది సూపర్వైజర్లపై కార్మికులు దాడి చేశారని, గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.


Click it and Unblock the Notifications









