కొట్టాయం ఫ్యాక్టరీలో లాకౌట్ను ఎత్తివేసిన ఎమ్ఆర్ఎఫ్

గత వారం సెలవు విషయంలో ఒక ఉద్యోగికి, సూపర్వైజర్కు మధ్య ఏర్పడిన వివాదం తీవ్రరూపం దాల్చడంతో బుధవారం రోజున ఎమ్ఆర్ఎఫ్ లాకౌట్ను ప్రకటించింది. బుధవారం ఉదయం 5 గంటల నుంచి లాకౌట్ అమలు చేసిన ఎమ్ఆర్ఎఫ్ శుక్రవారం ఉదయం లాకౌట్ను తొలగించింది.
లాకౌట్ కారణంగా గత నాలుగు రోజులుగా ఫ్యాక్టరీ కార్యకలాపాలు పూర్తిగా స్థంబించిపోవడంతో కంపెనీ సుమారు రూ. 22 కోట్ల మేర నష్టపోయింది. కొట్టాయం ఫ్యాక్టరీలో మొత్తం 1,350 మంది కార్మికులు మూడు షిఫ్ట్లలో పనిచేస్తున్నారు.


Click it and Unblock the Notifications








