వోల్వో ఆటో ఇండియా కొత్త ఛీఫ్గా థామస్ ఎర్న్బర్గ్

గడచిన 17 ఏళ్లుగా ఎర్న్బర్గ్ వోల్వో సంస్థలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం భారత యూనిట్కు ఛీఫ్గా వ్యవహరిస్తున్న పౌల్ డె వోయిజ్స్ బాధ్యతలను ఎర్న్బర్గ్ చేపట్టనున్నారు. ఈ పదవికి ముందు ఎర్న్బర్గ్ దుబాయ్లో రీజనల్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించబడ్డారు. భారత్లో వోల్వో కార్యకలాపాలు మరియు ప్రణాళికలకు ఆయన పూర్తి బాధ్యతలను వహించనున్నారు.


Click it and Unblock the Notifications








