ఫోర్డ్ మిడ్నైట్ సేల్ మళ్లీ వచ్చింది: కార్లపై ఆఫర్ల వెల్లువ
ఫోర్డ్ ఇండియా మిడ్నైట్ సేల్ మళ్లీ వచ్చింది. ఫోర్డ్ ఇండియా ఉదయం ఎనిమిది గంటల నుండి అర్థరాత్రి, షోరూమ్లను ఓపెన్ చేసి ఉంచి అమ్మకాలు నిర్వహిస్తూ, నమ్మశక్యం కాని ఆఫర్లతో కొనుగోలుదారులు ఆకట్టుకునేందుకు ఫోర్డ్ మరోసారి ముందుకొచ్చింది. వచ్చే బుధవారం (డిసెంబర్ 5, 2012) రోజున కంపెనీ తమ షోరూమ్లను ఆర్థరాత్రి వరకూ తెరచి, ఆ ఒక్కరోజు మాత్రమే తమ కార్లపై భారీ తగ్గింపులను, ప్రోత్సాహకాలను ఆఫర్ చేయనుంది. ఈ మిడ్నైట్ సేల్లో భాగంగా ఫోర్డ్ ఇండియా వివిధ కార్లపై అందిస్తున్న ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి:
- ఫోర్డ్ ఫిగో:
రూ.25,500 వరకూ సేవింగ్స్
ప్రారంభ ధర రూ.3.85 లక్షలు
- ఫోర్డ్ ఫియస్టా:
రూ.72,000 వరకూ సేవింగ్స్
ప్రారంభ ధర రూ.7.42 లక్షలు
- ఫోర్డ్ క్లాసిక్:
రూ.34,500 వరకూ సేవింగ్స్
ప్రారంభ ధర రూ.5.58 లక్షలు
- ఫోర్డ్ ఎండీవియర్:
రూ.81,000 వరకూ సేవింగ్స్
ప్రారంభ ధర రూ.18.20 లక్షలు
(పైన పేర్కొన్న అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఫోర్డ్ ఇండియా అధీకృత షోరూమ్లు డిసెంబర్ 5, 2012 బుధవారం రోజున ఉదయం 8 గంటల నుండి అర్థరాత్రి వరకూ తెరచి ఉంటాయని కంపెనీ తెలిపింది. ఆ రోజు ఫోర్డ్ కారును బుక్ చేసుకున్న వారికి ప్రత్యేక తగ్గింపులతో పాటు, ఆకర్షనీయమైన వడ్డీ రేట్లు, రూ.3.5 కోట్ల వరకూ విలువైన అశ్శూర్డ్ బహుమతులు గెలుచుకునే అవకాశాలున్నాయని ఫోర్డ్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. మరింకెందుకు ఆలస్యం, బుధవారం రోజున ఫోర్డ్ షోరూమ్కి వెళ్లి మీ డ్రీమ్ కారును సొంతం చేసుకునేందుకు సిద్ధంకండి.


Click it and Unblock the Notifications









