డీజిల్ వాహనాలపై ఏటా అధిక రోడ్ ట్యాక్స్: కిరీట్ పారిఖ్

ఇదే గనుక అమల్లోకి వస్తే.. డీజిల్ ఎస్యూవీలపై ఏకంగా రూ.50,000 వరకూ అధిక రోడ్ ట్యాక్స్ను వసూలు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. కొత్తగా కొనుగోలు చేసే డీజిల్ వాహనాలపై వన్ టైమ్ డీజిల్ పన్ను విధించడానికి ప్రత్యామ్నాయంగా, ప్రస్తుతం అమల్లో ఉన్న వన్ టైమ్ రోడ్ ట్యాక్స్ విధానాన్ని తొలగించి, దాని స్థానంలో వార్షిక పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని పారిఖ్ ప్రతిపాదించారు. పెట్రోల్, డీజిల్ వాహనాల రోడ్ ట్యాక్స్ మధ్య వ్యత్యాసాన్ని పాటించాలని ఆయన అన్నారు.
పెట్రోల్ వాహనాలతో పోలిస్తే, డీజిల్ వాహనాలపై రోడ్ ట్యాక్స్ సుమారు రూ.10,000 నుంచి రూ.20,000 వరకూ అధికంగా ఉండొచ్చని, డీజిల్ ఎస్యూవీలపై ఇది రూ.50,000 వరకూ అధికంగా ఉండొచ్చని వివరించారు.మరోవైపు, డీజిల్ ఇంధనానికి మార్కెట్ నిర్ధారిత రేటును నిర్ణయించాలని, దానిపై సబ్సిడీని లీటరుకు రూ.9 లకు మాత్రమే పరిమితం చేయాలని పారిఖ్ అన్నారు. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖకు సిఫార్సులు పంపించామని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications








