జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లను ఇండియాలో ఉత్పత్తి చేయం

అయితే, చైనాలో ఓ జేఎల్ఆర్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నామని, అక్కడ తయారైన జాగ్వార్ లాండ్ రోవర్ వాహనాలను విదేశాలకు ఎగుమతి రతన్ టాటా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. భారత్లో ఈ లగ్జరీ వాహనాలను తయారు చేయటానికి అనువైన పరిస్థితులు లేవని, ఒకవేళ ఇక్కడ ప్లాంటును ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తే, అందుకు కావల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పటికీ అనేక చిక్కులు కల్పిస్తున్నారని ఆయన చెప్పారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో, ప్రస్తుతం భారత్లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ వాహనాలను పూర్తి స్థాయిలో తయారు చేసే యోచన లేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం టాటా మోటార్స్ కొన్ని రకాల జేఎల్ఆర్ వాహనాల విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని, భారత్లో అసెంబ్లింగ్ చేస్తోంది. ఇక్కడి ఆర్థిక పరిస్థితులు, అమల్లో ఉన్న పన్నులను పరిగణలోకి తీసుకుంటే, వీటి దిగుమతి కన్నా వ్యయమే ఎక్కవుతుంది. అందుకే టాటా మోటార్స్ జేఎల్ఆర్ వాహనాలను ఇండియాలో ఉత్పత్తి చేయాలనుకోవటం లేదు.


Click it and Unblock the Notifications








