వేలానికి ప్రిన్సెస్ డయానా, ప్రిన్స్ ఛార్లెస్ వాడిన కారు
బ్రిటీష్ యువరాణి డయానా, యువరాజు ఛార్లెస్ల గురించి మనకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ప్రపంచ రాజరికపు చరిత్రలో వీరిద్దరూ ఓ అధ్యాయంగా నిలిచారు. గతంలో డయానా, ఛార్లెస్లు ఉపయోగించిన ఓ పురాతన కారు ఒకటి ప్రస్తుతం వేలానికి వచ్చింది. ప్రిన్సెస్ డయానా, ప్రిన్స్ ఛార్లెస్లు ఉపయోగించిన బుల్లెట్ప్రూఫ్ రోల్స్ రాయిస్ షాడో లగ్జరీ కారును ఈ వారం లండన్లో వేలం వేయనున్నారు. 1985లో వీరిద్దరూ తొలిసారిగా ఈ కారులో అమెరికాకు ప్రయాణించారు.
బ్రిటీష్ దౌత్య కార్యాలయం 1979లో ఈ రోల్స్ రాయిస్ షాడో కారును కొనుగోలు రాజ కుటుంబం కోసం కొనుగోలు చేసింది. కానీ, 1982 వరకూ సేవల్లోకి రాలేదు. ఆ తర్వాత ఇంజనీర్లు ఈ కారుపై మూడేళ్ల పాటు పనిచేసి, దీనిపై సుమారు 123,930 బ్రిటీష్ పౌండ్ల (మన దేశ కరెన్సీలో సుమారు 1 కోటి రూపాయలకు పైమాటే)ను వెచ్చించి బుల్లెట్, గ్రనేడ్, చిన్నపాటి బాంబు దాడుల నుంచి లోపలి ఉన్న ప్రయాణికుల రక్షించేలా ఈ కారును తయారు చేశారు.

ప్రిన్సెస్ డయానా, ప్రిన్స్ ఛార్లెస్లు ఉపయోగించిన బుల్లెట్ప్రూఫ్ రోల్స్ రాయిస్ షాడో లగ్జరీ కారును ఈ వారం లండన్లో వేలం వేయనున్నారు.

బుల్లెట్ప్రూఫ్ రోల్స్ రాయిస్ షాడో లగ్జరీ కారు

బ్రిటీష్ దౌత్య కార్యాలయం 1979లో ఈ రోల్స్ రాయిస్ షాడో కారును కొనుగోలు రాజ కుటుంబం కోసం కొనుగోలు చేసింది.

1985లో యువరాణి డయానా, యువరాజు ఛార్లెస్లు తొలిసారిగా ఈ కారులో అమెరికాకు ప్రయాణించారు.

ఈ వింటేజ్ కారును చికాగోలోని వోలో ఆటో మ్యాజియం నవంబర్ 9న ప్రముఖ ఆక్షన్ సంస్థ ఈబే వేలం వేయనున్నట్లు డైలీ మెయిల్ పేర్కొంది. వేలంలో ఈ రోల్స్ రాయిస్ షాడో బుల్లెట్ప్రూఫ్ లగ్జరీ కారు సుమారు 1.2 మిలియన్ పౌండ్లు (మన దేశ కరెన్సీలు సుమారు రూ.10 కోట్లకు పైగా) వెల పలకవచ్చని అంచనా.

రోల్స్ రాయిస్ షాడో కారు 1982 వరకూ సేవల్లోకి రాలేదు. ఆ తర్వాత ఇంజనీర్లు ఈ కారుపై మూడేళ్ల పాటు పనిచేసి, దీనిపై సుమారు 123,930 బ్రిటీష్ పౌండ్ల (మన దేశ కరెన్సీలో సుమారు 1 కోటి రూపాయలకు పైమాటే)ను వెచ్చించి బుల్లెట్, గ్రనేడ్, చిన్నపాటి బాంబు దాడుల నుంచి లోపలి ఉన్న ప్రయాణికుల రక్షించేలా ఈ కారును తయారు చేశారు.
వీరి ట్రిప్ సమయంలో యాంటీ-బ్రిటీష్ ఐఆర్ఏ మద్దతుదారులు ఈ రాజ దంపతులను వ్యతిరేఖించే వారు. ఆ సమయంలో వీరికి అత్యంత భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ బుల్లెట్ ప్రూఫ్ కారును తయారు చేశారు. ఈ వింటేజ్ కారును చికాగోలోని వోలో ఆటో మ్యాజియం నవంబర్ 9న ప్రముఖ ఆక్షన్ సంస్థ ఈబే వేలం వేయనున్నట్లు డైలీ మెయిల్ పేర్కొంది. వేలంలో ఈ రోల్స్ రాయిస్ షాడో బుల్లెట్ప్రూఫ్ లగ్జరీ కారు సుమారు 1.2 మిలియన్ పౌండ్లు (మన దేశ కరెన్సీలు సుమారు రూ.10 కోట్లకు పైగా) వెల పలకవచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








