లీటరుకు 29 కి.మీ. మైలేజీనిచ్చే సుజుకి వ్యాగన్ఆర్
జపనీస్ కార్ మేకర్ సుజుకి మోటార్ కార్పోరేషన్ వ్యాగన్ఆర్ హైబ్రిడ్ కారును తయారు చేసింది. ఇందుకోసం కంపెనీ అభివృద్ధి చేసిన 'ఈఎన్ఈ-చార్జ్' అనే పేటెంటెడ్ టెక్నాలజీని ఉపయోగించింది. పెట్రోల్ ఇంజన్ మరియు బ్యాటరీ పవర్లతో పనిచేసే ఈ వ్యాగన్ఆర్ హైబ్రిడ్ వెర్షన్ లీటర్ పెట్రోల్కు 28.8 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపనీ పేర్కొంది.
జపాన్లో ఆవిష్కరించిన వ్యాగన్ఆర్ హైబ్రిడ్ వెర్షన్ కారులో లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేసే ఎలక్ట్రిక్ మోటార్, పెట్రోల్ ఇంజన్లను ఉపయోగించారు. ఈ రెండి సాయంతో అత్యధిక మైలేజీని పొందవచ్చని సుజుకి పేర్కొంది. అంతేకాకుండా, ఇందులో 'ఎకో-కూల్' అనే ఎనర్జీ సేవింగ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ కూడా ఇంది. మైలేజ్ పెరగడానికి ఇది కూడ ఒక ప్రధాన కారణం. ఈ హైబ్రిడ్ వెర్షన్ వ్యాగన్ఆర్ హ్యాచ్బ్యాక్ను ఉత్పత్తి స్థాయికి తీసుకువచ్చే విషయాన్ని కంపెనీ స్పష్టం లేదు. ఏదేమైనప్పటికీ, నానాటికీ పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో ఇలాంటి హైబ్రిడ్ కార్ల అవసరం ఎంతైనా ఉంది.


Click it and Unblock the Notifications









