భారత్లో 2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ప్రీబుకింగ్స్ షురూ
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ ఎస్-క్లాస్ లగ్జరీ సెడాన్లో ఓ అప్గ్రేడెడ్ వెర్షన్ను త్వరలోనే కస్టమర్లకు పరిచయం చేయనుంది. ప్రస్తుత ఎస్-క్లాస్ సెడాన్ కన్నా మరింత మెరుగ్గా, అధునాత ఫీచర్లతో కొత్త 2014 ఎస్-క్లాస్ సెలూన్ లభ్యం కానుంది.
వచ్చే ఏడాది ఆరంభంలో కొత్త ఎస్-క్లాస్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, మెర్సిడెస్ బెంజ్ ఇండియా తమ 2014 ఎస్-క్లాస్ లగ్జరీ కారు కోసం విడుదలకు ముందే ప్రీబుకింగ్లను ప్రారంభించినట్లు సమాచారం. మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ కారును కొనే ధరతో (రూ.25 లక్షలతో) కొత్త ఎస్-క్లాస్ కారును బుక్ చేసుకోవచ్చు.
మెర్సిడెస్ బెంజ్ ఎస్500 లిమిటెడ్ ఎడిషన్ కోసం ముందస్తు బుకింగ్లను స్వీకరిస్తున్నారు, భారత మార్కెట్లో ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లు కేవలం 125 యూనిట్లు మాత్రమే లభ్యం కానున్నాయి. అందుకే, ముందుగా వచ్చిన వారికి ముందుగా డెలివరీ అన్న చందంగా ఈ మోడల్ కోసం ప్రీబుకింగ్లను ప్రారంభించారు.

అయితే, రెగ్యులర్ ఎస-క్లాస్ ఎస్350సిడిఐ మాత్రం వచ్చే ఏడాది మధ్య భాగంలో విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా.. ఈ కొత్త 2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్500 లిమిటెడ్ ఎడిషన్ విషయానికి వస్తే, ఇందులో 455 పిఎస్ల శక్తిని, 616 ఎన్ఎమ్ల టార్క్ను ఉత్పత్తి చేసే ట్విన్ టర్బో వి8 ఇంజన్ను ఉపయోగించారు. దీని ఫెండర్పై 'ఎడిషన్ 1' అనే బ్యాడ్జ్ ఉంటుంది.
ఈ కొత్త ఎడిషన్ 1 మోడల్, 258 పిఎస్ల శక్తిని, 619 ఎన్ఎమ్ల టార్క్ను ఉత్పత్తి చేసే ఇంజన్ కలిగిన స్టాండర్డ్ ఎస్350 సిడిఐ మోడల్ కన్నా ఎంతో విలాసవంతమైనది. కొత్త 2014 ఎస్-క్లాస్ కేవలం నలుపు, తెలుపు రంగులలో మాత్రమే లభ్యమవుతుంది. ఇది ఈ సెగ్మెంట్లో ఆడి ఏ8, బిఎమ్డబ్ల్యూ 7-సిరీస్ వంటి లగ్జరీ కార్లతో పోటీ పడుతుంది.


Click it and Unblock the Notifications








