కార్లలో హై-స్పీడ్ ఇంటర్నెట్ కోసం బిఎస్ఎన్ఎల్ మాడ్యూల్

కార్లలో అత్యధిక వేగంతో కూడిన అంతర్జాలాన్ని (హై-స్పీడ్ ఇంటర్నెట్)ను ఉపయోగించునేందుకు గాను వై-ఫై టెక్నాలజీ మాడ్యూల్స్ను బిఎస్ఎన్ఎల్ ఇండోర్ బ్రాంచ్ పరిచయం చేసింది. వై-ఫై టెక్నాలజీ మాడ్యూల్ ధర రూ.5000 నుంచి రూ.6000 రేంజ్లో ఉంటుంది. కారుకు పైభాగాన అమర్చిన యాంటినీ సాయంతో ఇది టెలిఫోన్ ఎక్సేంజ్ నుంచి సిగ్నల్స్ను గ్రహించి వై-ఫై రూపంలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందిస్తుంది.
సిడిఎమ్ఏ టెక్నాలజీ ఆధారంగా చేసుకొని ఈ మాడ్యూల్ను తయారు చేశామని బిఎస్ఎన్ఎల్ పేర్కొంది. ఇది 3.5 ఎమ్బిపిఎస్ వేగంతో వై-ఫై సిగ్నల్స్ను గ్రహిస్తుంది. తొలుతగా ఈ సిస్టమ్ను బిఎస్ఎన్ఎల్ ఇండోర్ యూనిట్ జనరల్ మేనేజర్ జిసి పాండే కారులో ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. బహుశా ఇది భారత్లో ఈ తరహా వ్యవస్థ మొట్టమొదటిని పాండే చెప్పారు. ఒక్కసారి ఇది పాపులారిటీని సంపాధించుకున్న తర్వాత వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఈ మోడల్ను ఆదరిస్తారని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications








