రూపీ ఎఫెక్ట్: పెరగనున్న కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు

రూపాయి విలువ పతనం కారణంగా దిగుమతి చేసుకునే విడి భాగాల వ్యయాలు గణనీయంగా పెరిగిపోయాయని, అందుకు దీటుగా తమపై క్లెయిమ్ల భారం కూడా పెరుగుతుంది గనుక ఆ భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయక తప్పదన్నది బీమా కంపెనీలు అంటున్నాయి.
సాధారణంగా కారు ధరను బట్టి బీమా ప్రీమియం ఆధారపడి ఉంటుందని, అయితే ఇటీవల కాలంలో కార్ల తయారీలో ఉపయోగించే కొన్ని దిగుమతి చేసుకునే విడిభాగాల ఖరీదు పెరగడంతో ఆటో కంపెనీలు ఆయా కార్ల ధరలను పెంచుతున్నాయి.
కారు ధర పెరగితే ఆటోమేటిక్గా దాని బీమా ప్రీమియం కూడా పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే, కార్ల బీమా ప్రీమియం 15 నుంచి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు గత 6 నెలలుగా ఉత్పత్తి సంస్థల్లో కార్మిక వ్యయాల సగటు 10 శాతం నుంచి 15 శాతం పెరిగిందని, ఫలితంగా ప్రీమియం పెంచడం తప్ప తమకు మరో మార్గం లేదని బీమా కంపెనీలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications








