రూ.10 లక్షల కన్నా తక్కువ ధర కలిగిన కార్లపై ఎస్యూవీ టాక్స్ వద్దు: ప్రఫుల్ పటేల్

ఈ విషయం గురించి ప్రఫుల్ పటేల్ ప్రస్తానిస్తూ, ఎస్యూవీలపై విధించిన ఎక్సైజ్ సుంకాన్ని మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఉందని, మోటార్ వాహన చట్టంలో ఎస్యూవీల గురించి సరైన వర్గీకరణ లేకపోవటం వల్లనే ఈ గందరగోళం తలెత్తిందని ఆయన అన్నారు. ఈ పెంపు వలన గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల రవాణా కోసం ఎక్కువగా ఉపయోగించే టాటా సుమో, మహీంద్రా బొలెరో వంటి వాహనాల ధరలు ప్రభావితమయ్యాయని ఆయన అన్నారు.
ఈ విషయాన్ని ఆర్థికమంత్రి పి చిదంబరం దృష్టికి తీసుకువెళ్లానని, రూ.10 లక్షలకు దిగువన ఉండే ఏ రకమైన వాహనాన్నైనా ఈ ఎస్యూవీ టాక్స్ నుంచి మినహించాలని ప్రతిపాదనలు చేశానని ప్రఫుల్ పటేల్ చెప్పారు. హైఎండ్ లగ్జరీ కార్లను ఉపయోగించే వారికి మాత్రం తప్పనిసరిగా ఈ పెంపును అలానే ఉంచాలి, వారికి సబ్సిడీ డీజిల్ను విక్రయించకూడదని అన్నారు. ఎస్యూవీలపై విధించిన అధిక సుంకాల విషయాన్ని పునఃపరిశీలించాలని ఆటోమొబైల్ పరిశ్రమ కోరటంలో న్యాయం ఉందని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications








