లీటరుకు రూ.10 చొప్పున పెరగనున్న డీజిల్ ధరలు

చమురు కంపెనీలు వంట గ్యాస్, డీజిల్, కిరోసిసన్లను మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకే విక్రయిస్తుండటంతో గడచిన సంవత్సరంలో సుమారు 1,67,000 కోట్ల ఆదాయ నష్టం వాటిళ్లనట్లు అంచనా. ఈ భారమంతా ప్రభుత్వం పైనే పడుతోంది. ఈ ఒత్తిడి నేపథ్యంలో, పెట్రో మంట నుంచి తప్పించుకునేందుకు గాను, ఆ మంటకే ప్రజలను ఆహుతి చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది. తమకు వేరొక మార్గం లేదని, ధరలు పెంచక తప్పదని చమురు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ఇందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందించనుందని, ఇందులో భాగంగా రానున్న పది నెలల్లో ప్రతి లీటరు డీజిల్పై నెలకు ఒక్క రూపాయి చొప్పును పెంపు విధించనున్నామని ఆయన తెలిపారు. గడచిన సెప్టెంబర్ నెలలో డీజిల్ ధరలను ఒక్కసారిగా ప్రతి లీటరుపై రూ.5 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.47.15 లుగా ఉంది. ఈ ధరకు విక్రయిస్తున్నప్పటికీ ఆయిల్ కంపెనీలు ప్రతి లీటరు డీజిల్ విక్రయంపై రూ.9.28 నష్టపోతున్నట్లు పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications








