స్వల్పంగా పెరిగిన డీజిల్ ధర; లీటరుపై 45 పైసల పెంపు

ఇలా స్వల్పంగా ధరను పెంచుతూ ఈ ఏడాది చివరి నాటికి మొత్తం రూ.9 మేర పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. స్థానిక పన్నులు కలుపుకుంటే, ఢిల్లీలో డీజిల్ ధర 51 పైసలు, ముంబైలో 57 పైసలు, కలకత్తాలో 53 పైసలు, చెన్నైలో 55 పైసల చొప్పును పెరుగుతుందని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ అధికారి ఒకరు వెల్లడించారు. ఫిబ్రవరి 16న డీజిల్ ధరలను సవరించిన సంగతి తెలిసినదే.
కాగా.. ఈనెల 16న చమురు కంపెనీలు పెట్రోల్ ధరను లీటరు పెట్రోల్పై రూ.2 చొప్పున (స్థానిక పన్నులు కలుపుకోకుండా) తగ్గించిన సంగతి తెలిసినదే. అయితే, ఆ సమయంలో డీజిల్ ధరలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. కొద్దిగా కొద్దిగా డీజిల్ ధరను పెంచడం ద్వారా తమపై పడుతున్న సబ్సిడీ భారం నుంచి తప్పించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అంటే, ఒకేసారి రూ.9 పెంచి అందరికీ తెలిసేలా పెద్ద వాత పెట్టే బదులు కొద్దిగా కొద్దిగా పెంచాలని సర్కారు యోచిస్తున్నట్లుంది.


Click it and Unblock the Notifications








