APSRTC 'ఫ్యామిలీ ఫోటో' చిట్కా హిట్, తగ్గిన రోడ్డు ప్రమాదాలు

ఇటీవల ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ కేసును దృష్టిలో ఉంచుకొని ఏపిఎస్ఆర్టిసి (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ) మహిళల కోసం తమ బస్సు ప్రయాణాన్ని మరింత సురక్షితం చేసింది. ఇందులో భాగంగా, మహిళా ప్యాసింజర్లపై అఘాయిత్యానికి పాల్పడే వారిని అడ్డుకుని ప్రయాణికులను రక్షణ కల్పించేందుకు గాను 7000 మందికి పైగా మహిళా కండక్టర్లకు మార్షన్ ఆర్ట్స్లో శిక్షణ కల్పిస్తోంది. ఏటా కనీసం 1.4 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించే ఏపిఎస్ఆర్టిసి, ప్రమాదాల నివారణలో పాటించిన ఉత్తమ విధానాలకు గాను సోమవారం నాడు రహదారుల మంత్రి సిపి జోషి చేతుల మీదుగా ట్రోఫీని అందుకుంది.
గడచిన రెండేళ్లలో ఏపిఎస్ఆర్టిసి వరుసగా ప్రతి లక్ష కిలోమీటర్లకు 0.13, 0.11 యాక్సిడెంట్లను మాత్రమే నమోదు చేసుకుంది. గతంలో ఇదివరకెన్నడూ లేని విధంగా, ప్రమాదాలను తగ్గించేందుకు తాము ఇటీవలే ప్రారంభించిన ఈ రెండు ప్రణాళిక వలన ప్రమాదాల సంఖ్య 0.09కు తగ్గిందని ఏపిఎస్ఆర్టిసి వైస్-ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏకె ఖాన్ తెలిపారు. డ్రైవర్లు బస్సు నడుపుతుండగా, డ్యాష్ బోర్డుపై తమ భార్యా పిల్లల ఫోటోలు ఉంచాలన్న నిబంధనను గడచిన సంవత్సరం జులై నెలలో అమల్లోకి తీసువచ్చారు.
ప్రతి డ్రైవర్ కూడా తాను సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తానని చెప్పి, ఇంటి నుంచి బయలుదేరుతాడని, ఇలా బస్సులో తమ ముందు భార్యా పిల్లల ఫోటో ఉండటం వలన, డ్రైవర్లు వారి కోసమైనా సురక్షితంగా ఇల్లు చేరాలనే మానసిక ఆలోచన వారిని బాధ్యతాయుతంగా డ్రైవ్ చేసేలా చేస్తుందని, ఈ నిబంధనను డ్రైవర్లు చక్కగా పాటించారని ఖాన్ చెప్పారు.


Click it and Unblock the Notifications








