ఈకోస్పోర్ట్ సక్సెస్: భారత్లో ఫోర్డ్ ఇండియా సేల్స్ రికార్డ్
భారత మార్కెట్లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ విడుదలతో, అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియా దశ తిరిగింది. ఇటీవలే దేశీయ మార్కెట్లోకి ప్రవేశించిన ఈ కాంపాక్ట్ ఎస్యూవీ హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. గడచిన నెలలో ఫోర్డ్ ఇండియా చరిత్రలోనే ఇదివరకెన్నడూ లేని విధంగా 14,217 యూనిట్ల కార్లు అమ్ముడుపోయాయి (ఎగుమతులతో కలిపి).
సవాళ్లతో కూడిన మార్కెట్ వాతావరణంలో సైతం ఫోర్డ్ ఇండియా సెప్టెంబర్ 2013 నెల అమ్మకాలు ప్రోత్సాహకర వృద్ధిని కనబరచాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంతో పోల్చుకుంటే, కంపెనీ అమ్మకాలు ఏకంగా 51 శాతం పెరిగాయి. అమ్మకాలు ఈ స్థాయిలో వృద్ధి సాధించడం కంపెనీ చరిత్రలో ఇదే మొదటిసారి.
ఇందులో ఫోర్డ్ ఇండియా దేశీయ అమ్మకాలు 37 శాతం వృద్ధి చెంది 7,794 యూనిట్ల నుంచి 10,640 యూనిట్లకు పెరిగాయి. అలాగే ఎగుమతులు 3,577 యూనిట్లుగా నమోదయ్యాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. కంపెనీ అమ్మకాలు ఇంత రికార్డు స్థాయిలో పెరగటానికి కారణం కంపెనీ అందిస్తున్న ఈకోస్పోర్ట్ ఎస్యూవీనే.



Click it and Unblock the Notifications








