నేపాల్కు మహీంద్రా వాహనాలను కానుకగా ఇవ్వనున్న భారత్
నేపాల్లోని ప్రతి ఒక్కరికీ నవంబర్ 19, 2013వ తేది అతి ముఖ్యమైన రోజు, ఎందుకంటే ఆ రోజున కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి కాబట్టి. ఈ ఎన్నికలకు మద్దతుగా మన భారత ప్రభుత్వం నేపాల్ సర్కారుకు 630 మహీంద్రా వాహనాలను కానుకగా ఇవ్వనుంది.
మొత్తం 630 మహీంద్రా స్కార్పియో, బొలెరో వాహనాలను నేపాల్ ఎలక్షన్ కమిషన్, హోం మంత్రిత్వ శాఖకు అందజేయనున్నారు. నేపాల్లో ఈ వాహనాలను సెక్యూరిటీ బలగాలు, పోలీస్ బలగాలు, సాయుధ పోలీస్ బలగాలు తమ కాన్వాయ్లో భాగంగా ఉపయోగించనున్నాయి.

ఈ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఇంటర్నేషనల్ ఆపరేషన్స్, ఆటో, ఫామ్ ఎక్విప్మెంట్ సెక్టార్స్) రుజ్బెహ్ ఇరానీ మాట్లాడుతూ.. భారత్-నేపాల్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేలా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం, అందులోను తమ వాహనాలను కానుకగా ఇవ్వాలనుకోవటం తమకెంతో సంతోషంగా ఉందని అన్నారు.
తమకు ఇదెంతో గర్వించ దగిన విషయమని ఆయన చెప్పారు. ఈ వాహనాలను నేపాల్లోని మహీంద్రా అధీకృత దిగుమతిదారు అయిన అగ్ని ఇన్కార్పోరేటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేపాల్ సర్కారుకు అందించనున్నారు. అగ్ని ఇన్కార్పోరేటెడ్ 1991వ సంవత్సరం నుంచి నేపాల్లో మహీంద్రా వాహనాలను విక్రయిస్తుంది. ఈ సంస్థకు నేపాల్లో 22 డీలర్షిప్ కేంద్రాలున్నాయి.


Click it and Unblock the Notifications








