లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకెక్కిన మహీంద్రా ఎక్స్‌యూవీ500

By Ravi

కారులో ఎవరైనా భారతదేశంలోని ఈ చివరి ఆ చివరి వరకు 62 గంటల్లో వెళ్లగలరా..? అసాధ్యం అంటారా..! కానీ సాధ్యమైంది. దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా బృందం తమ పాపులర్ ఎక్స్‌యూవీ500 ఎస్‌‌యూవీలో కేవలం 62 గంటల 20 నిమిషాల వ్యవధిలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నిరంతరాయంగా మొత్తం 3997 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సరికొత్త రికార్డును సృష్టించారు.

అంతేకాదు, ఇదే అంశంపై గతంలో ఉన్న రికార్డును మహీంద్రా బద్దలు కొట్టింది. గతం రికార్డు ప్రకారం ఇదే దూరాన్ని 72 గంటల 47 నిమిషాల్లో చేరుకున్నట్లు ఉంది. కాగా మహీంద్రా బృందం తమ ఎక్స్‌యూవీ500 ఈ రికార్డును ఇదివరకటి రికార్డు సమయం కన్నా 10 గంటల 27 నిమిషాల ముందుగానే చేరుకుంది.


మహీంద్రా ఈ రికార్డు కోసం భారతీయ రోడ్లకు అనుగుణంగా, అన్ని వాతావరణాలకు సరిపోయే విధంగా ఉండే తమ చిరుత లాంటి 'ఎక్స్‌యూవీ500'ను ఎంచుకుంది. దాదాపు ఈ 4 వేల కిలోమీటర్ల ప్రయాణంలో మహీంద్రా బృందం ఎక్కడా కూడా బ్రేక్ తీసుకోకుండా నిరంతరాయంగా రాత్రింబవలు ప్రయాణించి ఈ రికార్డును సృష్టించింది. ఆద్యంతం అడ్వెంచరస్‌గా సాగిన ఈ రికార్డును మనం కూడా క్రింది వీడియోలో వీక్షిద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/1xfUktOaiPQ?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Saturday, November 30, 2013, 10:03 [IST]
English summary
Watch the non-stop journey of the Cheetah from Kanyakumari to Kashmir over a distance of 3997 kms! The XUV500 conquered this route in just 62 hrs and 20 mins beating the previous record and entering the Limca Book of Records!&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+