ఉత్తరాఖాండ్ బాధితులకు మారుతి సుజుకి సాయం
ఉత్తరాఖాండ్లో కనీవినీ ఎరుగని రీతిలో కైలాసనాధుని సాక్షిగా సంభవించిన వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు ఎవరు తోచిన సాయం వారు చేస్తున్నారు. కార్పోరేట్ కంపెనీలు తమ ఉద్యోగులందరి జీతం లోనుంచి ఒక్క రోజు జీతాన్ని దానం చేస్తుండగా, మరికొన్న స్వచ్ఛం సంస్థలు ముందుకు వచ్చి వారికి సాయం అందిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా కూడా ఉత్తరాఖాండ్ బాధితులకు సాయం చేసేందుకు తన ఆపన్న హస్తాన్ని అందించింది. ఉత్తరాఖాండ్ బాధితులకు సత్వర వైద్య సేవలు అందించేందుకు గాను ఐదు అంబులెన్స్ వాహనాలను దానం చేసింది. అంతేకాకుండా, ఉద్యోగులందరూ తమ ఒక్క రోజు జీతాన్ని దానం చేశారు.
మారుతి సుజుకి ఇండియా ఇలా 1.56 కోట్ల రూపాయలను సమీకరించిన ఆ మొత్తాన్ని ప్రైమ్ మినిస్టర్ నేషల్ రిలీఫ్ ఫండ్కు అందజేసింది. ఇటీవల సంభవించిన ఉత్తరాఖాండ్ వరదల్లో 10,000 మందికి పైగా మృతి చెందినట్లు అంచనా వేస్తుండగా, 70,000 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. గల్లంతైన వారు సురక్షితంగా తమ ఆప్తులను కలుసుకోవాలని మనం కూడా ఆ భగవంతుడిని ప్రార్ధిద్దాం.



Click it and Unblock the Notifications








