హైదరాబాద్లో మిత్సుబిషి కొత్త షోరూమ్ ప్రారంభం
ప్రముఖ జపనీస్ కార్ కంపెనీ మిత్సుబిషి హైదరాబాద్లో మరొక కొత్త షోరూమ్ను ప్రారంభించింది. మిత్సుబిషి తమ భారతీయ భాగస్వామి హిందుస్థాన్ మోటార్స్ సహకారంతో హైదరాబాద్లోని మాదాపూర్లో 3000 చ.అ. పైగా విస్తీర్ణంలో ఓ అధునాతన షోరూమ్ను కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ షోరూమ్కు సమీపంలోనే ఓ పెద్ద వాహన సర్వీసింగ్ కేంద్రాన్ని కూడా కంపెనీ ప్రారంభించింది. 12000 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సర్వీస్ సెంటర్లో మిత్సుబిషి రోజుకు 25 కార్లను సర్వీసింగ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ప్రస్తుతం మిత్సుబిషి దేశీయ విపణిలో సెడియా స్పోర్ట్స్, అవుట్లాండర్, పాజెరో స్పోర్ట్, మోంటెరో, లాన్సర్ ఎవల్యూషన్ ఎక్స్ కార్లను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.8.24 లక్షల నుంచి రూ.50.23 లక్షల రేంజ్లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కాగా హైదరాబాద్లో కొత్తగా ఏర్పాటు చేసిన షోరూమ్లో పాజెరో స్పోర్ట్, మాంటెరో, అవుట్లాండర్లను కంపెనీ ప్రదర్శనకు ఉంచనుంది. మిత్సుబిషి హైదరాబాద్ కొత్త షోరూమ్, సర్వీస్ సెంటర్ల చిరునామాలు ఇలా ఉన్నాయి:
షోరూమ్:
1-10/4, 1-10/4A & 1-10/4B,
Madhapur, Hyderabad.
Andhra Pradesh
సర్వీస్ సెంటర్:
Jai Hind Enclave
Madhapur, Hyderabad.
Andhra Pradesh



Click it and Unblock the Notifications








