రాష్ట్ర మార్కెట్లో పియాజ్జియో ఆప్పె సిటీ విడుదల
ఇటలీకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ పియాజ్జియో ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త ఆటోరిక్షా 'ఆప్పె సిటీ' (Ape City)ని ఇప్పుడు రాష్ట్ర మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్యాసింజర్ వెర్షన్ ఆప్పె సీటీ ఆటోరిక్షా రాష్ట్ర మార్కెట్లో ఎల్పిజీ, సిఎన్జీ మరియు పెట్రోల్ ఇంధన ఆప్షన్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ సేల్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ ప్రాబ్ తెలిపారు.
ఆదివారంలో రాష్ట్రంలోని దిట్టకవి సర్వీస్ సెంటర్ను ప్రవీణ్ ప్రాబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ, పట్ట ప్రయాణికుల సురక్షితమైన ప్రయాణానికి ఆప్పె సీటీ ఎంతగానో సహకరిస్తుందని అన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం వల్లనే రవాణారంగంలో 13 ఏళ్లుగా నంబర్ వన్ స్ధానంలో నిలిచామని ఆయన చెప్పారు.

తమ ఆటోరిక్షాలు మంచి మైలేజీని ఇవ్వడం వల్ల డ్రైవర్లుకు మరింత మెరుగైన ఉపాధి లభిస్తుందని, పియాజ్జియో ఆప్పే ఆటోలను కొనుగోలు చేసే వారికి మొట్టమొదటి సారిగా ఆటోలైఫ్ పేరిట ఆంధ్రాబ్యాంకు సహకారంతో 3 లక్షల రూపాయల ఉచిత భీమా సౌకర్యం అందిస్తున్నామని ప్రవీణ్ ప్రాబ్ వివరించారు. ఈ ఆటోరిక్షాలు 10,000 కిలోమీటర్లు లేదా రెండేళ్ల ఉచిత వారెంటీతో లభిస్తాయి.
పియాజ్జియో అందిస్తున్న 4 స్ట్రోక్ ఇంజన్ కలిగిన ఆటోరిక్షాల వాడకం వలన పర్యావరణ కాలుష్యం ఉండదని, ఈ ఇంజన్లు 200సీసీ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి కాబట్టి, ఇవి మంచి పికప్ను కలిగి ఉండి ప్రయాణికులను సులభంగా గ్యమస్ధానం చేరుకునేందుకు సహకరిస్తాయని ఆయన తెలిపారు. ఇందనంలో 2టి ఆయిల్ వినియోగించాల్సిన అవసరం ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications








