స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు

తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 90 పైసలు పెరిగి రూ.63.09 నుంచి రూ.63.99కి పెరిగింది. అలాగే డీజిల్ ధర రూ.49.69 నుంచి 50.25కి పెరిగింది. డీజిల్ ధరకు, పెట్రోల్ ధరకు మధ్య వత్యాసం కేవలం 14 రూపాయలుగా మాత్రమే ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ వ్యత్యాసం మరింత చేరువయ్యే ఆస్కారం ఉంది. గడచిన జనవరి నెలలో డీజిల్ ధరలపై ప్రభుత్వం పాక్షికంగా నియంత్రణలు ఎత్తివేసిన తర్వాత ప్రతినెలా డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి.
ఇదిలా ఉండగా, వంట గ్యాస్ (ఎల్పిజి) ధరను ప్రతి సిలిండర్పై రూ.45 చొప్పున తగ్గిస్తున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. డీజిల్ ధరను వరుసగా 5వ సారి పెంచినప్పటికీ, చమురు కంపెనీలు ప్రతి లీటరు డీజిల్ విక్రయంపై రూ.4.87 చొప్పను నష్టపోతున్నట్లు ప్రకటించాయి. దీన్ని బట్టి గమనిస్తే, రానున్న డీజిల్ నెలల్లో డీజిల్ ధర దాదాపు రూ.5 వరకు పెరిగే ఆస్కారం కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications








