పెట్రో మంట; లీటరుకు రూ.2కు పైగా వడ్డింపు

Price Hike
వాహన ప్రియులకు షాకింగ్ న్యూస్. పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. గడచిన జూన్ 2010లో పెట్రోల్ ధరలపై ప్రభుత్వం తమ నియంత్రణలను తొలగించడంతో, చమురు కంపెనీలు ఇష్టారాజ్యంగా పెట్రోల్ ధరను పెంచేస్తున్నాయి. గడచిన నెలలో కూడా పెట్రోల్ ధర లీటరుకు రూ.2 లకు పైగా పెరిగిన సంగతి తెలిసినదే. కాగా.. తాజాగా లీటరుపై రూ.1.55 పైసలు చొప్పున (స్థానిక పన్నులు కలుపుకోకుండా) పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి.

పన్నులు కలుపుకుంటే ఈ పెంపు రూ.2 లకు వరకు ఉంటుంది. పెరిగిన పెట్రోల్ ధర ఆదివారం ఆర్థరాత్రి నుంచే అమల్లోకి రానుంది.

అసలే పెరిగిన నిత్యావసర ధరలతో బాధపడుతున్న సమాన్యులకు తాజా పెంపు మరింత భారం కానుంది. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 1.86 పైసలు పెరిగింది. దీంతో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర 68.58గా ఉంటే, తాజా పెంపుతో ఇది రూ.70.44కు చేరింది.

డాలరుతో పోల్చుకుంటే రూపాయి విలువ క్షీణిస్తుండటమే తాజా పెంపుకు కారణం. గడచిన నెల నుంచి పెట్రోల్ ధరలు పెరగటం వరుసగా ఇది నాలుగోసారి. చమురు కంపెనీలు జూన్ 1వ తేదీన లీటరు పెట్రోల్‌పై 75 పైసలు, జూన్ 16వ తేదిన రూ.2 మరియు జూన్ 29న 1.82 చొప్పున పెంచిన సంగతి తెలిసినదే.

More from DriveSpark

Article Published On: Sunday, July 14, 2013, 21:39 [IST]
English summary
OIl companies today hiked the price of petrol by a steep Rs. 1.55 a litre, without taxes, as the falling rupee made imports costlier. The price of diesel was kept unchanged.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+