మారుతి సుజుకి కార్మికుల కుటుంబాలపై లాఠీఛార్జ్!

ఈ కేసులో అరెస్టయి గుర్గావ్ జైలులో ఉన్న 147 మంది శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులను తక్షణమే విడుదల చేసి, వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కార్మికుల కుటుంబీకులు ఏప్రిల్ 28 నుంచి ఖైతాల్లోని మినీ సెక్రటేరియేట్ వద్ద శాంతియుత ధర్నా నిర్వహిస్తున్నారు. అయితే, గడచిన ఆదివారం వారిని పోలీసులు ఖాలీ చేయించాలని ప్రయత్నించండో ఆందోళనకారులు తిరగబడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జ్కపు ఉపక్రమించారు.
గడచిన సంవత్సరం జులై 18న జరిగిన మానేసర్ అల్లర్లలో మారుతి సుజుకి హెచ్ఆర్ మేనేజర్ సజీవంగా అగ్నికి ఆహుతి కాగా, మరో 96 మంది గాయపడిన సంగతి తెలిసినదే. ఈ ఘటనకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.


Click it and Unblock the Notifications








