మహీంద్రా ప్లాంటులో సమ్మె, 500 యూనిట్ల ఉత్పత్తి నష్టం

ఈ నేపథ్యంలో, సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు పని నిలిపివేయడంతో ఉత్పత్తిపై ప్రభావంచూపిందని కార్మిక నాయకుడు ఒకరు తెలిపారు. ఎమ్ అండ్ ఎమ్ నాసిక్ ప్లాంట్ యూనియన్ అధ్యోఉడు శిరిష్ భావ్సార్ మరియు ప్రవీణ్ శిండేలతో పాటు యూనియన్ నాయకులంతా సోమవారం నుంచి నాసిక్లోని డిప్యూటీ లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు నిరాహార దీక్షకు ఉపక్రమించారు.
కాగా.. మార్చి 5, 2013 సాయంత్రం 6.00 గంటల నుండి జరుగుతున్న ఈ టూల్డైన్ సమ్మె కారణంగా, దాదాపు 500 యూనిట్ల ఉత్పత్తి నష్టం వాటిళ్లందని, అయితే మరో మూడు వారాలకు సరపడా స్టాక్ తమ వద్ద ఉన్నందును అమ్మకాలపై తక్షణమే ఎలాంటి ప్రభావం ఉండబోదని కంపెనీ స్పష్టం చేసింది. సమ్మెను విరమింపజేసేందుకు యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే ఇది ఓ కొలిక్కి వచ్చే ఆస్కారం ఉందని మహీంద్రా అండ్ మహీంద్రా నాసిక్ ప్లాంటు యాజమాన్యం ధీమా వ్యక్తం చేస్తోంది.


Click it and Unblock the Notifications








