జైలులో కార్ స్పేర్స్ను తయారు చేయనున్న ఖైదీలు
కార్లను దొంగిలించే దొంగలే కొత్త కార్లను తయారు చేస్తే, వినడానికే విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది నిజం. జైలులో శిక్షణ అనుభవిస్తున్న ఖైదీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో, జైలు ఆవరణంలోనే ఓ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పింది ఓ ఇండో-జపాన్ జాయింట్ వెంచర్ కంపెనీ.
భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ఈ తరహా విధానానికి శ్రీకారం చుట్టారు భారత్కు చెందిన స్పార్క్ మిండా, అశోఖ్ మిండా గ్రూప్ మరియు జపాన్కు చెందిన ఫురుకవా కంపెనీల జాయింట్ వెంచర్ మిండా ఫురుకవా ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎమ్ఎఫ్ఈ).
తీహార్ జైలులో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఢిల్లీ జైళ్లకు డైరక్టర్ జనరల్ అయిన అశోక్ వెర్మ ఈ స్మాల్ స్కేల్ ప్రొడక్షన్ యూనిట్ని ప్రారంభించారు. ఈ కంపెనీ వైరింగ్ హార్నెస్ మరియు ఫోర్ వీలర్స్ కోసం అవసరమైన వైరింగ్ లూమ్స్కు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేస్తుంది.

ఈ సందర్భంగా, ఢిల్లీ జైళ్ల డిఐజి, పిఆర్ఓ ముకేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ చర్య వలన జైలులో శిక్షకాలం అనుభవిస్తున్న వారు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది, ఈ ప్లాంట్ ఏర్పాటు వలన వారు తర్ఫీదు పొందటంతో పాటుగా వేతనం కూడా పొందుతారని, వారి శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఈ అనుభవమే వారికి మంచి ఉపాధిని చూపించేందుకు పనికొస్తుందని అన్నారు.
ఈ ప్రొడక్షన్ విధానాన్ని సూపర్వైజర్ల ద్వారా పర్యవేక్షించబడుతుంది, ఇతర ఖైదీలు సంపాధించుకునే మొత్తంతో పోల్చుకుంటే ఈ ప్లాంట్లో పనిచేసే ఖైదీలు ఎక్కువ డబ్బును సంపాధించుకోవచ్చు. ప్రారంభంలో భాగంగా, 30 మంది ఖైదీలు ఈ ప్లాంట్లో పనిచేస్తారని, ఆ తర్వాతి క్రమంగా వీరి సంఖ్య పెరుగుతుందని ప్రసాద్ తెలిపారు.


Click it and Unblock the Notifications








