బ్యాంకు ఉద్యోగుల కోసం 'మహీంద్రా బ్యాంకర్స్ బొనాంజా' ఆఫర్
భారతదేశపు అగ్రగామి యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) ప్రత్యేకించి బ్యాంక్ ఉద్యోగుల కోసం 'బ్యాంకర్స్ బొనాంజా' ఆఫర్ పేరిట ఓ ప్రత్యేక స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్లో భాగంగా, తమ వాహనాలకు కొనుగోలు చేయాలనుకునే బ్యాంక్ ఉద్యోగులకు రూ.25,000 వరకు ప్రయోజనాలను అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
దేశవ్యాప్తంగా ఈ బ్యాంకర్స్ బొనాంజా స్కీమ్ అందుబాటులో ఉంటుందని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ ఆటోమోటివ్ డివిజన్ చీఫ్ సేల్స్ అండ్ కస్టమర్ కేర్ ఆఫీసర్ రుణ్ మల్హోత్రా మాట్లాడుతూ, దేశంలో అధిక శాతం వాహనాలను ఫైనాన్స్ ద్వారానే కొనుగోలు చేస్తున్నారని, అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని ఈ స్కీమ్ను ప్రవేశపెట్టామని చెప్పారు.

ఈ విషయంలో బ్యాంకర్లు అందించే విలువైన సహకారానికి కృతజ్ఞతలు వెల్లడించేలా, తమ అనుబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలాలనే ఉద్దేశ్యంతో ఈ బ్యాంకర్స్ బొనాంజా స్కీమ్ను రూపొందిచామని ఆయన వివరించారు. ఈ స్కీమ్ ఆగస్ట్ 31, 2014 వరకు చెల్లుబాటులో ఉంటుంది. బ్యాంక్ ఉద్యోగులు ఈ సమయంలో ఏ మహీంద్రా షోరూమ్నైనా సందర్శించి ఈ ఆఫర్ పొందవచ్చు.


Click it and Unblock the Notifications








