ఉత్పత్తుల ధరలను పెంచిన మహీంద్రా, టాటా మోటార్స్

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు తమ వాహనాల ధరలను 1-2 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో, ధరలు పెంచాల్సి వచ్చిందని ఇరు కంపెనీలు పేర్కొన్నాయి.

తాజా పెంపుతో మహీంద్రా అందిస్తున్న ప్యాసింజర్, వాణిజ్య వాహనాల ధరలు మోడల్‌ను బట్టి రూ.2,300 నుంచి రూ.11,500 వరకు (ఎక్స్-షోరూమ్ ధరపై) పెరగగా, ట్రాక్టర్ల ధరలు రూ.6,000 నుంచి రూ.10,000 వరకూ పెరిగాయి.

Mahindra Tata Motors Up Prices To Offset Rising Input Costs

గత కొంత కాలంగా ధరల పెంపును వాయిదా వేస్తూ వస్తున్నామని, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాన్ని పాక్షికంగా తట్టుకునేందుకు ధరలను పెంచక తప్పడం లేదని, తాజా ధరల పెరుగుదల ఈ నెల నుంచే వర్తిస్తుందని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్, ఇంటర్నేషనల్ ఆపరేషన్స్) ప్రవీణ్ షా తెలిపారు.

కాగా.. టాటా మోటార్స్ గడచిన అక్టోబర్, నవంబర్ నెల నుంచే వాణిజ్య వాహనాల ధరలను 1-2 శాతం వరకు పెంచామని, ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Wednesday, November 12, 2014, 9:33 [IST]
English summary
Auto majors Tata Motors and Mahindra & Mahindra on Tuesday announced price increases in the range of 1-2 per cent citing higher input costs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+