లక్ష యూనిట్ల సేల్స్ మార్క్ను తాకిన ఎక్స్యూవీ500
ఎస్యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా భారత మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమయిం ఎస్యూవీ 'ఎక్స్యూవీ500' అప్పుడే 1,00,000 అమ్మకాల మార్కును చేరుకుంది. మార్కెట్లో విడుదలైన కేవలం 33 నెలలకే మహీంద్రా ఎక్స్యూవీ500 ఈ ఘనత సాధించింది.
భారతదేశంలో కెల్లా అతి తక్కువ సమయంలో లక్ష యూనిట్ల మార్కును చేరుకున్న ఎస్యూవీ కూడా ఇదే కావటం విశేషం. రూ.10-20 లక్షల సెగ్మెంట్లో లభిస్తున్న ఎస్యూవీలలో కెల్లా తమ ఎక్స్యూవీ500 అతివేగంగా వృద్ధిని సాధిస్తోందని కంపెనీ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రవీణ్ షా తెలిపారు.
జనవరి 2013 నాటికే మహీంద్రా ఎక్స్యూవీ500 అమ్మకాలు 50,000 యూనిట్ల మార్కును చేరుకున్నాయి. ప్రారంభంలో ఈ మోడల్ కేవలం మూడు వేరియంట్లలో (డబ్ల్యూ6, డబ్ల్యూ8, డబ్ల్యూ8 ఆల్-వీల్ డ్రైవ్) మాత్రమే లభ్యమయ్యేది. కాగా కంపెనీ ఇందులో ఇటీవలే డబ్ల్యూ4 అనే ఎంట్రీ లెవల్ వేరియంట్ను విడుదల చేసింది.

జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో 3000 యూనిట్ల ఎక్స్యూవీ500 మోడళ్లు అమ్ముడయ్యాయి. ఈ త్రైమాసికంలో హై-ఎండ్ ఎస్యూవీ సెగ్మెంట్లో మహీంద్రాకు 51 శాతం మార్కెట్ వాటా ఉండగా, ఎస్యూవీ సెగ్మెంట్లో 40 శాతం మార్కెట్ వాటా ఉన్నట్లు గణంకాలు వెల్లడిస్తున్నాయి.
ఈ మోడల్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎస్యూవీ ఆఫ్ ది ఇయర్, రీడర్స్ ఛాయిస్ అవార్డ్, బెస్ట్ వ్యాల్యూ ఫర్ మనీ కార్ అవార్ట్ వంటి 25 విభిన్న అవార్డులను గెలుచుకుంది. కంపెనీ ఇందులో ఓ ఆటోమేటిక్ మరియు హైబ్రిడ్ వెర్షన్ను మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications








