ఈకోస్పోర్ట్, డస్టర్ దుమ్ము దులిపిన మహీంద్రా స్కార్పియో
ఎస్యూవీ మార్కెట్లోకి ఎన్ని కొత్త మోడళ్లు ప్రవేశిస్తున్నప్పటికీ, దేశీయ యుటిలిటీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న పవర్ఫుల్ స్కార్పియోకి ఉన్న క్రేజే వేరు. స్టన్నింగ్ లుక్తో మంచి రోడ్ ప్రజెన్స్ కలిగి ఉన్న ఎస్యూవీని ఇష్టపడిని వారంటూ ఎవరూ ఉండరేమో. అందుకే ఈ మోడల్కు డిమాండ్ ఇప్పటికీ తగ్గడం లేదు.
ఎస్యూవీ సెగ్మెంట్లో లేటెస్ట్గా వచ్చిన ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెనో డస్టర్ వంటి పాపులర్ మోడళ్లను సైతం స్కార్పియో వెనక్కు నెట్టేసింది. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు మోడళ్ల మొత్తం అమ్మకాల కన్నా స్కార్పియో అమ్మకాలే ఎక్కువగా ఉన్నాయి.

2013-14 ఆర్థిక సంవత్సరంలో రెనో ఇండియా మొత్తం 46,700 డస్టర్ ఎస్యూవీలను విక్రయించగా, ఫోర్డ్ ఇండియా మొత్తం 45,000 ఈకోస్పోర్ట్ ఎస్యూవీలను విక్రయించింది. కాగా.. ఇదే సమయంలో మహీంద్రా అండ్ మహీంద్రా 50,900 స్కార్పియోలను విక్రయించింది. అంతేకాదు.. గడచిన మార్చ్ నెలలో 5,605 మహీంద్రా స్కార్పియో ఎస్యూవీలు అమ్ముడుపోయాయి. ఈ సెగ్మెంట్లో ఇదే అత్యధికం.
DON'T MISS: FACEBOOK VIDEO OF THE DAY


Click it and Unblock the Notifications








