ఫోక్స్వ్యాగన్ ఇండియా ఎమ్డిగా తీరే లెస్పియాక్
ఫోక్స్వ్యాగన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ సక్సేనా పదవి నుంచి తప్పుకొని, జనరల్ మోటార్స్ సంస్థలో చేరటంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు కంపెనీ చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో, మహేష్ కొడుమూడి తాత్కాలికంగా ఫోక్స్వ్యాగన్ ఇండియాకు ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా, దేశంలో ఫోక్స్వ్యాగన్ గ్రూపుకు ఛీఫ్ రెప్రజెంటేటివ్గా కూడా వ్యవహరించనున్నారు.
ఇది కూడా చదవండి: జిఎమ్ ఇండియాకు కొత్త బాస్గా అరవింద్ సక్సేనా


తీరే లెస్పియాక్ 2004లో ఫోక్స్వ్యాగన్ సంస్థలో చేరారు, అంతకు మునుపు ఆయన రెనో-నిస్సాన్ సూసీకి సీఈఓగా పనిచేశారు. దానికి మునుపు టొయోటా ఫ్రాన్స్ విభాగానికి సీఈఓగా పనిచేసిన అనుభం ఆయనకు ఉంది. అలాగే జనరల్ మోటార్స్ సంస్థలో 14 ఏళ్ల పాటు సేల్స్, సర్వీస్ విభాగాల్లో కూడా ఆయన పనిచేశారు.


Click it and Unblock the Notifications








