ఫోక్స్వ్యాగన్ పోలో, వెంటో కార్ల ధరల పెంపు
జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోక్స్వ్యాగన్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న పోలో హ్యాచ్బ్యాక్ మరియు వెంటో సెడాన్ కార్ల ధరలను 2.7 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇన్పుట్ కాస్ట్స్ పెరగటం, ఎక్సేంజ్ రేట్లలో హెచ్చుతగ్గుల కారణంగానే ధరలు పెంచాల్సి వస్తుందని ఫోక్స్వ్యాగన్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా పెంపుతో ఫోక్స్వ్యాగన్ పోలో ధరలు రూ.22,700 వరకు, ఫోక్స్వ్యాగన్ వెంటో ధరలు రూ.26,800 వరకు పెరగనున్నాయి. ఈ ధరల పెంపు ఫిబ్రవరి 1, 2014వ తేది నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ వివరించింది.
ఇదిలా ఉండగా.. అన్ని ఫోక్స్వ్యాగన్ పోలో హ్యాచ్బ్యాక్ వేరియంట్లలో ఫ్రంట్ డ్యూయెల్ ఎయిర్బ్యాగ్స్ను స్టాండర్డ్ ఫిట్మెంట్గా ఆఫర్ చేస్తున్నామని కంపెనీ ప్రకటించింది. పోలో కంఫర్ట్లైన్ వేరియంట్లో ఎయిర్బ్యాగ్స్తో పాటుగా ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)ను కూడా స్టాండర్డ్గా ఆఫర్ చేస్తున్నారు.



Click it and Unblock the Notifications








