భారత్లో యోకోహమా జియోలాండర్ టైర్స్ విడుదల
జపాన్కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ యోకోహమా తమ జియోలాండర్ రేంజ్ టైర్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ టైర్లు ప్రత్యేకించి ఆఫ్-రోడ్ ప్రయోజనం కోసం డిజైన్ చేయబడ్డాయి. భారతదేశంలో యోకోహమా మొట్టమొదట సారిగా అందిస్తున్న ఈ మడ్ టెర్రైన్ టైర్లు (బురద రోడ్లపై ప్రయాణించేందుకు అనువుగా ఉండే టైర్లు) జియోల్యాండర్ బ్యాడ్జ్ను కలిగి ఉంటాయి.
భారతదేశంలో కూడా ఆఫ్-రోడ్ కల్చర్ వేగంగా విస్తరిస్తోందని, అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే ఇష్టపడే కస్టమర్లు తమ వాహనాలకు మంచి ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలు కలిగిన టైర్లను అమర్చుకునేందుకు ఇష్టపడుతారని, అలాంటి వారి కోసమే ప్రత్యేకంగా తాము ఈ జియోలాండర్ రేంజ్ టైర్లను ఇక్కటి మార్కెట్లో ప్రవేశపెట్టామని యోకోహమా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ టకేషీ ఫుజినో తెలిపారు.

విజువల్ అప్పీల్, సుపీరియర్ పెర్ఫార్మెన్స్లను దృష్టిలో ఉంచుకొని యోకోహమా తమ జియోలాండర్ టైర్లను డిజైన్ చేసింది. భారత్లో కేవలం రెండు సైజులలో మాత్రమే ఈ జియోలాండర్ టైర్లు అందుబాటులో ఉంటాయి, అవి - 31x10.50 R15, 33x12.50 R15. ఈ మడ్ టెర్రైన్ టైర్లు పంక్చర్లను, కోతలను తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.


Click it and Unblock the Notifications








