Just In
- 57 min ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 1 hr ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- 2 hrs ago కూతురికి రూ.2 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి.. ఫిదా చేస్తున్న వీడియో
- 3 hrs ago కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
Don't Miss
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
2017 నాటికి రానున్న అశోక్ లేలాండ్ ఎలక్ట్రిక్ బస్ 'వెర్సా'
హిందూజా గ్రూపుకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం అశోక్ లేలాండ్, 2017 నాటికి 'వెర్సా' అనే ఎలక్ట్రిక్ బస్సును భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించింది. ఈ మేరకు గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 4వ బస్ అండ్ స్పెషల్ వెహికల్ ఎక్స్పోలో అశోక్ లేలాండ్ తమ వెర్సా ఎలక్ట్రిక్ బస్సును ప్రదర్శించింది.
అశోల్ లేలాండ్ వెర్సా ఎలక్ట్రిక్ బస్సులో మొత్తం 36 సీట్లు ఉంటాయి. సింగిల్ చార్జ్పై ఈ బస్సు 90 మైళ్ల దూరం ప్రయాణించగలదు. రెగ్యులేషన్స్ని బట్టి, వచ్చే రెండేళ్లలో ఈ వాహనాన్ని ఇండియాలో విడుదల చేయవచ్చని భావిస్తున్నామని అశోక్ లేలాండ్ వైస్ ప్రెసిడెంట్ టి వెంకటరామన్ తెలిపారు.
యూకేకి చెందిన ఆప్టేర్ పిఎల్సి కంపెనీ ద్వారా అశోక్ లేలాండ్ ఈ బస్సులను ఇండియాలో విడుదల చేయనుంది. పూర్తిగా యూకేలో తయారైన బస్సులను (సిబియూ రూట్లో) ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు. ఆప్టేర్ కంపెనీలో అశోక్ లేలాండ్కు మెజారీ వాటా ఉంది.
వెర్సా ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైనదని, ఎలాంటి వాయు, శబ్ధ కాలుష్యాలను కలిగించదని, ఈ బస్సు ఒక కిలోమీటరు దూరం ప్రయాణించడానికి 1 యూనిట్ విద్యుత్ మాత్రమే వినియోగించుకుంటుందని వెంటకరామన్ వివరించారు.
ఈ ఎలక్ట్రిక్ బస్సు ఖరీదు సుమారు రూ.2-3 కోట్లు ఉండొచ్చని అంచనా. భారత మార్కెట్లో ఆప్టేర్ ఎలక్ట్రిక్ బస్సులను అశోక్ లేలాండ్ బ్యాడ్జ్తోనే విక్రయించాలని కంపెనీ భావిస్తోంది. ప్రారంభ దశలో భాగంగా ఆప్టేర్ సోలో, వెర్సా మెడళ్లను ఇండియాకు తీసుకురానున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులలో కేవలం మోటార్లు, బ్యాటరీలు మాత్రమే ఉంటాయి.