2017 నాటికి భారత్లో ఫియట్ క్రైస్లర్ జీప్ ఉత్పత్తి ?
ఫియట్ క్రైస్లర్ ఆటోమొబైల్స్ తన ఆదీనంలో ఎన్నో బ్రాండ్లను తయారుచేస్తోంది. అయితే గత కొన్ని సంవత్సరాలనుంచి జీప్ మోడల్ను ఉత్పత్తి చేయాలనుకుంటోంది. అది సాధ్యం కావడం లేదు.
ఇప్పుడు ఫియట్ క్రైస్లర్ 2017 నాటికి భారత్లో ఫియట్ క్రైస్లర్ జీప్ ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు దృవీకరించింది. టాటా మోటార్స్తో కలిసి వారు ఈ మోడల్ను ఉత్పత్తి చేయనున్నారు.

టాటా మోటార్స్ ఈ జీప్ ఉత్పత్తి కోసం ఫియట్ క్రైస్లర్ ఆటోమొబైల్స్తో కలిసి జాయింట్ వెంచర్ను ప్రారంభించనుంది. స్థానికంగా ఈ మోడల్ను ఉత్పత్తి చేయనుండటంతో ఇది కొంచెం లాభించనుంది.
ఈ జీప్ ఉత్పత్తి కోసం వారు భారత్లో 280 మిలియన్ యూఎస్ డాలర్లు పెట్టుబడిపెట్టనున్నారు. 2018 నుంచి అమ్మకాలను పెంచనున్నట్లు ఫియట్ క్రైస్లర్ ఆటోమొబైల్స్ ఛీఫ్ ఎక్సిక్యూటివ్ సెర్గియో మార్చియోని తెలిపారు.

ఇంతకు ముందు జీప్ ఉత్పత్తులు భారత మార్కెట్లో ఉన్నప్పటికీ వాటిని 2015 నుంచి తయారీ యూనిట్లుగా చేయనున్నారు. ఈ జీప్ ఉత్పత్తి విజయవంతం అయిన తర్వాత చెరోకీ మరియు వ్రాంగ్లర్ మోడళ్లను ముందుకు తేనుంది.
మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్ స్పార్క్.......


Click it and Unblock the Notifications








