కొత్త లీడర్షిప్ స్థానాన్ని తయారుచేసిన జీఎమ్ ఇండియా?
అమెరికన్ ఆటోమొబైల్ తయారీ సంస్థ జనరల్ మోటార్స్ అనేక బ్రాండ్ల వాహనాలను తన ఆధీనంలో ఉంచుకుంది. ఇది ప్రస్తుతం తన పోర్ట్ఫోలియో మోడల్ను భారత మార్కెట్లో కలిగిఉంది.
ప్రస్తుతం జనరల్ మోటార్స్ భారత్లో అమ్మకాల్లో ముందంజలో లేదు. ఇప్పుడు చాలా కాలం తర్వాత భారత మార్కెట్లో కొత్త లీడర్షిప్ స్థానాన్ని తయారుచేసింది.

జనరల్ మోటార్స్ ఇండియా అధ్యక్షులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ సక్సేనా మాట్లాడుతూ.... " కస్టమర్లకు సంతృప్తి కలిగించడానికి భారత మార్కెట్లో కొత్త అపాయింట్మెంట్స్ను మా కృషితో చాలా వరకు పెంచుతున్నాము" అని తెలిపారు.
జనరల్ మోటార్స్ , ఉబేకిస్తాన్ అధ్యక్షులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ కహేర్ ఖాజెమ్ జనరల్ మోటార్స్ ఇండియాకు ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు. పరిశ్రమలను నడపటమే ఆయన ముఖ్య కర్తవ్యం.

జనరల్ మోటార్స్ ఇండియా హర్దీప్ సింగ్ అనే వ్యక్తిని ఉపాధ్యక్షునిగాను నియమించింది. ఆయన 2015 జూలెై 1న భాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన తమ ప్రధానకేంద్రం గుర్గావ్లో విధులు నిర్వర్తిస్తారు.
2015 ఆగష్టు 1 నుంచి జనరల్ మోటార్స్ ఇండియా మార్కెటింగ్ మరియు కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఉపాధ్యక్షునిగా భాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ముగ్గురు చేరిన అనంతరం జనరల్ మోటార్స్ ఇండియా అధ్యక్షులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ సక్సేనాకు రిఫోర్ట్ చేయనున్నారు.
మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్ స్పార్క్.......


Click it and Unblock the Notifications








