జీఎమ్ ఇండియా ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా కహెర్ ఖాజీం
జీఎమ్ ఇండియా తన సంస్థకు ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా కహెర్ ఖాజీంను నియమించింది. ఖాజీం ఇంతకు ముందు హోల్డెన్లో ఇంజనీర్గా పనిచేశారు.
ఈయన ఆగష్టు 1 నుంచి తయారీ వైపు భాద్యతలు తీసుకోనున్నారు. ఖాజీం ప్రస్తుతం జనరల్ మోటార్స్ ఉబేకిస్తాన్లో మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన ముంబైలోని టలిగాన్ దభాదే ప్లాంట్కు మారనున్నారు.

ఆయన ఆ పదవిలో 2012 నుంచి ఉన్నారు. అంతకుముందు థాయిలాండ్ మరియు ఆసియా జనరల్ మోటార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు క్వాలిటి ఉఫాధ్యక్షులుగా పనిచేశారు.
జీఎమ్ సేల్స్కు కొత్త ఉపాధ్యక్షులుగా హర్దీప్ సింగ్ బ్రార్ను నియమించింది. వీడబ్ల్యూ మాజీ ఎగ్జిక్యూటివ్ జాక్ ఉప్పల్ను మార్కెటింగ్ మరియు కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఉపాధ్యక్షులుగా నియమించింది.
ఈ ముగ్గురు జనరల్ మోటార్స్ ఇండియా అధ్యక్షులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ సక్సేనాకు రిపోర్ట్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications








