భద్రత దృష్ట్యా 3 మోడళ్లను రీకాల్ చేసిన జీఎమ్ ఇండియా
జనరల్ మోటర్స్ ఇండియా భద్రత ప్రమాణాల దృష్ట్యా మూడు మోడళ్లను రీకాల్ చేసింది. సుమారు 1,55,000 వాహనాలు రీకాల్ చేయబడ్డాయి.
దీని గురించిన మరిన్ని విషయాలను క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం........

రీ కాల్ చేయబడిన వాటిలో 2007 నుంచి 2014 వరకు అమ్మకం జరిపిన బీట్, ఎంజాయ్ మరియు స్పార్క్ మోడళ్ల కార్లు ఉన్నాయి.

రిమోట్ కీ లెస్ ఎంట్రి సిస్టమ్ లేకపోవడంతో యాక్ససరీస్ ఇష్యు క్రింద రీ కాల్ చేసినట్లు సమాచారం.

తయారీదారి సంస్థ ఈ సమస్యను కస్టమర్లకు తెలియచెప్పే పనిలో పడింది. జనరల్ మోటర్స్ రెప్రసెంటేటివ్లు కార్ల తనిఖీ మరియు సమస్య నివారణ మార్గాలను వివరిస్తున్నారు.

ఎటువంటి చార్జి లేకుండా కస్టమర్లు తమ వాహనాలను రిపేరి చేయించుకోవచ్చు. బీట్, ఎంజాయ్ మరియు స్పార్క్ మోడళ్లను జనరల్ మోటర్స్ ఇండియా యొక్క 257 సర్వీస్ స్టేషన్లలో ఎక్కడైనా రిపేరి చేయించుకోవచ్చు.

జనరల్ మోటర్స్ ఇండియా అధ్యక్షులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ సక్సేనా మాట్లాడుతూ....." మేము క్వాలిటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. కస్టమర్లకు ఇబ్బంది పెట్టకుండా పని చేస్తాం " అని తెలిపారు.

ఇది చాలా భావ్యమైన సమస్య దీన్ని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు.
Also Read : మరిన్ని ఆసక్తికర విషయాలు
Also Read : మరిన్ని ఆసక్తికర విషయాలు


Click it and Unblock the Notifications








