19 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో 40 లక్షల కార్లను అమ్మిన హ్యుందాయ్...!!
హ్యుందాయ్ మోటార్ ఇండియా దాదాపుగా 19 సంవత్సరాల క్రింత మనం దేశ ఆటో మొబైల్ మార్కెట్లోకి తన స్యాంట్రొ మోడల్ ద్వారా పరిచయం అయింది. ఇప్పడు 19 వసంతాలు పూర్తి చేసుకున్న హ్యుందాయ్ మోటార్స్ ఇండియా దాదాపుగా 40 లక్షల వాహనాలను అమ్మినట్లు తెలిపింది.
మరింత చదవండి: సరి కొత్త మార్పులతో రానున్న హ్యుందాయ్ క్రెటా
అయితే హ్యుందాయ్ మోటార్స్ ఇన్ని సంవత్సరాల కాలంలో 2015 అక్టోబర్ మాసంలో అత్యధిక అమ్మకాలను నమోదు చేసుకుంది. 47,015 మొత్తం హ్యుందాయ్ వాహనాలు ఈ ఒక్క నెలలోనె అమ్ముడుపోయి 23.7 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.
మరింత చదవండి: 20 నెలల్లో.. 1.5 లక్షల ఎలైట్ ఐ20 కార్లను అమ్మిన హ్యూందాయ్
హ్యుందాయ్ మోటార్స్ యమ్డి శ్రీ వైకె కూ మాట్లాడుతూ, ప్రస్తుతం హ్యుందాయ్ మోటార్స్ భారతీయ మార్కెట్లోకి పది అత్యదిక ఆదరణ కలిగిన మోడల్లను అందించామని తెలిపాడు. అంతే కాకుండా దేశీయంగా తయారైన మోడల్లను ఎగుమతి చేస్తున్నట్లు తెలిపాడు.హ్యుందాయ్ మోటార్స్ దేశంలోని అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా విసృత శ్రేణి వాహనాలను అందిస్తోంది. ఇది హ్యుందాయ్ మోటార్స్ యొక్క ఆబివృద్దికి చిహ్నంగా భావిస్తున్నామని ఈ సంధర్బంగా తెలిపారు.



Click it and Unblock the Notifications