2018 నాటికి భారత్కు రానున్న ల్యాంబోర్గిని ఉరస్
తయారీదారులు అన్నిటికంటే మొదట డిజైన్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. దిగ్గజ ప్రీమియం లగ్జరీ కార్ తయారీ సంస్థ ల్యాంబోర్గిని కూడా అదే విధానాన్ని పాటిస్తోంది.
ల్యాంబోర్గిని తన ఫర్మామెన్స్ ఎస్యూవీని చాలా సార్లు అంతర్జాతీయ మోటార్ షోలలో ప్రదర్శించింది. ఈ ఇటాలియన్ తయారీ సంస్థ తన చివరి ఉత్పత్తి తన కాన్సెఫ్ట్ వెహికల్ మాదిరి ఉంటుందని వెల్లడించింది.

ఈ ఇటాలియన్ తయారీ సంస్థ తన కాన్సెఫ్ట్ కార్ మాదిరి డిజైన్కు ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇది ఫలిస్తే ల్యాంబోర్గిని మరో విజయాన్ని తన ఖాతాలో తప్పక వేసుకోనుంది.

ల్యాంబోర్గిని ప్రస్తుతం అవెంటడార్ మరియు హురాకెన్ మోడళ్లను భారత్లో అందిస్తోంది. 2018 నాటికి తన ఉరస్ మోడల్ను భారత్లో విడుదల చేయనున్నట్లు ల్యాంబోర్గిని అధికారికంగా వెల్లడించింది.

యూఎస్ఏ, చైనా, రష్యా మరియు యూరోపియన్ దేశాల మార్కెట్లపై ఎక్కువ శ్రద్ధ చూపుతోంది. ల్యాంబోర్గిని ఏడాదికి 3000 ఫర్మామెన్స్ ఎస్యూవీలన అమ్మకం జరపాలని భావిస్తోంది.
Also Read : మరిన్ని ఆసక్తికర విషయాలు


Click it and Unblock the Notifications








