మహీంద్ర హరిద్వార్ ప్లాంటులో 7,00,000 ఉత్పత్తి మైలురాయిని అధిగమించిన సిబ్బంది
హరిద్వార్లో గల మహీంద్ర ప్లాంటులోని సిబ్బంది 7,00,000 యూనిట్ల ఉత్పత్తిని సాధించారు. కేవలం పది సంవత్సరాల కాలంలోనే వారు ఈ ఉత్పత్తిని సాధించినట్లు తెలిపారు. హరిద్వార్లో గల ప్లాంటుని డిసెంబర్ 2005న ప్రారంబించారు. ప్రస్తుతం ఇందులో ఆల్ఫా, బొలెరొ, ఛాంపియన్, జియో మరియు స్కార్పియో ఎస్2 వంటి మోడళ్లను వారు ఉత్పత్తి చేస్తున్నారు.

గత ఏడాది నవంబర్ నాటికి అక్కడ గల సిబ్బంది ఆరు లక్షల ఉత్పత్తిని సాధించినట్లు తెలిపారు. అతి తక్కువ కాలంలోనే అంటే కేవలం 10 నెలల వ్యవధిలోనే వారు 1,00,000 యూనిట్ల తయారిని సాధించారు.
దక్షిణ భారతదేశంలో గల ఏకైక ప్లాంట్ హరిద్వార్ ప్లాంట్ మరియు దేశంలో అత్యధికంగా ఎక్కువ ఉత్పత్తి సాధించే ప్లాంటుగా కూడా పేరు గడించింది. గడిచిన రెండు సంవత్సరాలుగా దీనిలో గల సిబ్బంది ఎక్కువ ఉత్పత్తి సాదిస్తున్నారు.
ఇది మహీంద్ర యొక్క విజయానికి గుర్తు అని ఎమ్ అండ్ ఎమ్ లిమిటెడ్ ప్రెసిడెంట్ మరియు ముఖ్యకార్యనిర్వాహణ అధికారి ప్రవీన్ షా తెలిపారు.


Click it and Unblock the Notifications








