త్వరలో విడుదల కానున్న మహీంద్రా వెరిటో ఎలక్ట్రిక్ కారు
మహీంద్రా అండ్ మహీంద్రా వారు త్వరలో తమ వాహన కుటుంబంలోకి సరి కొత్త వెరిటో ఎలక్ట్రిక్ కారును చేర్చుకుంటోంది. భారతీయ మార్కెట్లోకి మహీంద్రా వారు ఎలక్ట్రిక్ వాహనాలను అందించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం డీజల్ వాహనాల మీద నిబంధనలు కొనసాగుతున్న తరుణంలో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లో తీసుకురావాలని మహీంద్రా ఆలోచిస్తోంది.
Also Read: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్దిగాంచిన వోక్స్వ్యాగన్ బీటిల్ కారు గురించి పది ఆశక్తికరమైన విశయాలు
మహీంద్రా మోటార్స్ వారు మాక్సిమో మరియు వెరిటో ఇవి ఎలక్ట్రిక్ వాహనాలను 2014 లో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించారు. ఈ వెరిటో ఇవి కారును 2016 ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాదిలోనే దీనిని అమ్మకాలకు సిద్దం చేయనున్నారు.
Also Read: త్వరలో భారత్కు హస్క్వర్నా మోటార్ సైకిల్స్
ఈ ఎలక్ట్రిక్ కార్లలలో ఎనర్జీని స్టోర్ చేసుకోవడానికి లిథియం అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తున్నారు. ఇంతకు ముందు మహీంద్రా వారు విడుదల చేసిన ఇ2ఓ మరియు రెవా లలో కూడా ఈ బ్యాటరీలనే ఉపయోగించారు.



Click it and Unblock the Notifications








