జపాన్కు కార్లు ఎగుమతి చేస్తున్న మారుతి సుజుకి
మారుతి సుజుకి భారత మార్కెట్లో చాలా రకాల ఉత్పత్తులను అందిస్తోంది. వారు సబ్కాంటినెంట్లోనే ముందున్న ఫోర్ వీలర్ తయారీ మరియి అమ్మకందారులు.
ఈ జపాన్ ఆధారిత తయారీ సంస్థ భారత్ నుంచి ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న ఒక ప్రముఖ ఎగుమతిదారు కూడాను. ప్రస్తుతం మారుతి సుజుకి ఆఫ్రికా, లాటిన్ అమెరికాలతో పాటు సౌత్-ఈస్ట్ మరియు సౌత్ ఆసియా మార్కెట్ల నుంచి అధికంగా డిమాండ్ ఉంది.

ఇప్పుడు వింత ఏంటంటే సుజుకి ఇండియాలో ఉత్పత్తి చేసి తన మాతృ దేశం జపాన్కు ఎగుమతి చేస్తోంది. తన ప్రీమియం హ్యాచ్బ్యాక్ వైఆర్ఏను జపాన్ మార్కెట్ కోసం ఎగుమతి చేస్తోంది.
ప్రస్తుతం ఫోర్డ్ ఇండియా మాత్రమే తన ఉత్పత్తులను దేశాలకు పంపుతున్న ఆటోమొబైల్ తయారీ సంస్థ. మేకిన్ ఇండియా సిద్ధాంతాన్ని ఫోర్డ్ ఖచ్చితంగా పాటిస్తోంది. సుజుకి కూడా ఇదే బాటలో పయనిస్తోంది.

భవిష్యత్తులో డిమాండ్ను బట్టి సుజుకి జపనీస్ మార్కెట్కు ఎగుమతి చేయనుంది. ప్రీమియం హ్యాచ్బ్యాక్ వైఆర్ఏ భారత్లో అభివృద్ధి చేసి కొన్ని మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది.
గమనించవలసిన విషయం ఏంటంటే మారుతి సుజుకి కొన్ని మోడళ్లను భారత్లో విడుదల చేయకుండా కేవలం ఎగుమతి చేయడం కోసమే ప్రత్యేకంగా తయారు చేస్తోంది.
Also Read : మరిన్ని ఆసక్తికరమైన విషయాలు


Click it and Unblock the Notifications








