మెర్సిడెస్-బెంజ్ త్వరలో తన జిఎల్ఇ యస్.యు.వి ని విడుదల చేయనుంది: మరింత సమాచారం....
మెర్సిడెస్-బెంజ్ ఇండియా తన మరొకస మోడల్ జియల్ఇ యస్.యు.వి ని అక్టోబర్ 14, 2015 న విడుదల చేయనుంది. 2015 సంవత్సరంలో భారత మార్కెట్లోకి మెర్సిడెస్-బెంజ్ విడుదల చేసిన వాటిలో ఇది 13 వ మోడల్ అని తెలిపారు. అయితే ఈ 2015 సంవత్సరం చివరి నాటికి మొత్తం 15 మోడళ్లను విడుదల చేయాలనే ఆలోచనలో కంపెని ఉంది .

జియల్వి యస్.యు.వి రెండు ఇంజిన్ వేరియంట్లలో భారత్లోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ మోడల్ లో 3.0లీటర్ న6 డీజిల్ ఇంజిన్ కలదు. ఇది 254 హార్స్పవర్, 620 ఎన్ఎమ్ అత్యధిక టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.
వినియోగదారులకు మరొక వేరియంట్ ను పరిచయం చేస్తున్నాం, అది 2.1-లీటర్ 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్. ఈ ఇంజిన్ మీకు ఇస్తుంది 201 హార్స్పవర్ మరియు 500 ఎన్ఎమ్ అత్యధిక టార్క్ను అందిస్తుంది.

ఇంతకు ముందు మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎమ్యల్-క్లాస్ ని విక్రయింస్తుండేది. అయితే దీని స్థానంలో జిఎల్ఇ యస్.యు.వి కు మార్పులు చేసి ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారి కంపెని తరువాత దశలో ఏఎమ్జి పవర్ గల జిఎల్ఇ ని ప్రవేశపెట్టే అలోచనలో ఉంది.
మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఇ యస్.యు.వి లో కొన్ని భధ్రత పరమైన ఫీచర్లను అందిస్తోంది. క్రాస్ విండ్ అసిస్ట్, తాకిడి అరికట్టే ఫీచర్, డైనమిక్ సెలెక్ట్, సహజంగా ఆన్ మరియు ఆఫ్ వంటి ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ మధ్యనే మెర్సిడెస్-బెంజ్ మే బ్యాక్ ను మార్కెట్లోకి విడుదల చేసింది అయితే అనూహ్యంగా అమ్ముడైనట్లు తెలుస్తోంది.

అయితే ఇండియా మార్కెట్లో మెర్సిడెస్-బెంజ్ యొక్క అమ్మకాలు ఊపందుకుంటున్న తరుణంలో బెంజ్ ఉత్పత్తులను దేశీయంగా చకన్ లేదా పూనె లో తయారీని మొదలు పెట్టే ఆలోచనలో కంపెని ఉంది. మిగిలిన రెండు ఉత్పత్తులను త్వరలోనే విడుదల చేయనున్నారు. త్వరలో విడుదల కానున్న వారి మరొక మోడల్ ఏఎమ్ జిటి స్పోర్ట్స్ కారు తమ అంచనాలను నిజం చేయగలదు అనే ఆలోచనలో ఉన్నారు మరి దీని కోసం మనం కూడా ఎదురుచూద్దాం...


Click it and Unblock the Notifications