కొత్త 2016 ఈ-క్లాస్ మోడల్ తో మెరవనున్న మెర్సెడిస్ బెంజ్?
మెర్సెడిస్ బెంజ్ ఇండియా తన సరికొత్త మోడల్ ను దేశానికి పరిచయం చేసింది. ఈ జర్మన్ కార్ తయారీ సంస్థ తన 15వ కారు ఆవిష్కరణలో భాగంగా ఈ-క్లాస్ మోడల్ ను పరిచయం చేసింది.
భారత్ లో 30,000 ల సెడాన్ అమ్మకాలు జరిగిన సందర్భంగా కొత్త ఈ-క్లాస్ మోడల్ ను తీసుకువచ్చింది. భారత్ లో ప్రారంభ దశ నుంచే ఈ-క్లాస్ మోడళ్లు లగ్జరీ కార్ల కొనుగోలుదార్ల నుంచి మంచి ఆదరణ పొందుతోంది.

మెర్సెడిస్ బెంజ్ ఈ-క్లాస్ మోడల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి :
- ఈ-200 : రూ.48,50,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
- ఈ-250 సీడీఐ : రూ.50,70,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
- ఈ-350 సీడీఐ : రూ.59,90,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

మెర్సెడిస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈవో ఎబెర్ హార్డ్ కెర్న్ మాట్లాడుతూ.. మా ఈ-క్లాస్ మోడల్ సెడాన్ తో భారత్ లో ఒక రేంజ్ కు వెళ్లనున్నాము. కస్టమర్ల కోసం ఆధునిక పరికరాలతో దాన్ని రూపొందించాము అని తెలిపారు. ఈ సెగ్మెంట్లో తప్పక రాణిస్తామని ఆయన వెల్లడించారు.
2016 ఈ-క్లాస్ మోడల్ కొన్ని కొత్త ఫీచర్స్ తో మరియు మెకానికల్ గా ఎటువంటి మార్పులు లేకుండా మెర్సెడిస్ బెంజ్ తయారు చేసింది. ఈ జర్మన్ కార్ తయారీ సంస్థ దీనికి ఇంటెల్లిజెంట్ సూపర్ పవర్ అని పేరు పెట్టింది.

మెర్సెడిస్ బెంజ్ ఈ-క్లాస్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి :
- నెవీ రెడీ ఫంక్షన్ తో కొత్త టెలిమ్యాటిక్స్.
- గ్యార్మిన్ ఫైలట్ న్యావిగేషన్.
- కొత్త రివర్స్ కెమెరా.


Click it and Unblock the Notifications








