సరి కొత్త ల్యాండ్ క్రూయిజర్ను విడుదల చేసిన టయోటా: ధర రూ. 1.29 కోట్లు.
జపాన్ కు చెందిన ప్రముఖ కార్ల తయారీదారులైన టయోటా మోటార్స్ భారతీయ మార్కెట్లోకి అత్యంత ఖరీదైన తన ల్యాండ్ క్రూయిజర్ యస్యువి ని విడుదల చేసింది. దీని ధర ఎంతో తెలుసా అక్షరాల 1.29 కోట్ల రుపాయలు.
ఇంత ఖరీదైన యస్యువి లో ఎంత వరకు ఖరీదైన ఫీచర్లు ఉన్నాయో ఒక సారి చూద్దామా ? అయితే క్రింద గల స్లైడర్లను పరిశీలించండి.

ఇంజన్
టయోటా ల్యాండ్ క్రూయిజర్ లో 4.5- లీటర్ వి8 డీజల్ ఇంజన్ కలదు. ఇది 281 బిహెచ్పి పవర్ మరియు 647 అత్యధిక టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. మరియు ఈ ఇంజన్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ను కలిగి ఉంది.

ఎక్స్స్టీరియర్
సరికొత్త టయోటా ల్యాండ్ క్రూయిజర్ లో కొత్త హెక్సాగొనల్ ఫ్రంట్ గ్రిల్ కలదు, యల్ఇడి హడ్ ల్యాంప్స్, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు నూతనంగా తయారు చేయబడిన వెనుక వైపు కాంబినేషన్ ల్యాంప్స్.

ఫీచర్లు
- స్టీరింగ్ వీల్ విత్ హీటర్
- యల్ఇడి ఇల్యుమినేటెడ్ ఎంట్రీ సిస్టమ్
- టైర్ ప్రెసర్ మానిటరింగ్ సిస్టమ్
- మల్టీ-టెర్రెైన్ మానిటర్ కెమెరాలు

మల్టీ మీడియా
కొత్త టయోటా ల్యాండ్ క్రూయిజర్ లో అతి పెద్ద ఎలక్ట్రో మల్టీ-వర్షన్ ఆడియో సిస్టమ్ కలదు. మరియు ఇందులో 4.2-అంగుళాల టియఫ్టి ఇన్ఫో డిస్ల్పే కలదు.

ఇంటీరియర్
ల్యాండ్ క్రూయిజర్లో ఉన్న కన్సోల్ మొత్తం సాటిన్ సిల్వర్ ఫినిషింగ్తో రూపొందించబడినది. మరియు దీని ఇంటీరియర్ వివిధ రకాల కొత్త రంగులలో లభిస్తుంది.

లభించు రంగులు
ఇది రెండు సరి కొత్త రంగుల్లో పరిచయం అవుతోంది. అవి కాపర్ బ్రౌన్ మరియు డార్క్ బ్లూ అంతే కాకుండా ఇది సూపర్ వైట్, వైట్ పియర్ల్ క్రిస్టల్ షైన్, సిల్వర్ మెటాలిక్, బ్లాక్, ఆట్టిట్యూడ్ బ్లాక్, డార్క్ రెడ్ మైకా మెటాలిక్ మరియు బీజి మైకా మెటాలిక్ అనే రంగుల్లో కూడా లభిస్తుంది.



Click it and Unblock the Notifications








