నిస్సాన్ పాట్రాల్ ఎస్యూవీ ఇండియాకు వస్తోంది; ధరెంతో తెలుసా?
జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్, భారత లగ్జరీ ఎస్యూవీ మార్కెట్లో ఓ సరికొత్త మోడల్ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కంపెనీ గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్న నిస్సాన్ పాట్రాలో ఎస్యూవీని ఇక్కడి మార్కెట్లో విడుదల చేయనుంది.
నిస్సాన్ తమ పాట్రాల్ ఎస్యూవీని సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయించనుంది. ఫలితంగా దీని ధర కూడా అధికంగానే ఉండే అవకాశం ఉంది. ఇదొక 7-సీటర్ లగ్జరీ ఎస్యూవీ.

నిస్సాన్ పాట్రాల్ ఇంజన్:
- 5.6 లీటర్, వి8 పెట్రోల్ ఇంజన్
- 400 హార్స్పవర్ల శక్తిని
- 559 న్యూటన్ మీటర్ల టార్క్
- 6-స్పీడ్ మ్యాన్యువల్, 7-స్పీడ్ మరియు 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్స్
నిస్సాన్ పాట్రాల్ ధర:
ఈ లగ్జరీ ఎస్యూవీని పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోనున్న కారణంగా భారత మార్కెట్లో దీని ధర కోటి రూపాయల వరకూ ఉండొచ్చని అంచనా.

నిస్సాన్ పాట్రాల్ ఫీచర్లు:
- హిల్ స్టార్ట్ అసిస్ట్
- హిల్ డిసెంట్ కంట్రోల్
- యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్
- ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
- బ్రేక్ అసిస్ట్
- క్రాష్ సెన్సిటివ్ ఆటోమేటిక్ అన్లాక్ సిస్టమ్
- ఆటో హాజర్డ్ లైటింగ్ సిస్టమ్


Click it and Unblock the Notifications








