వరుసగా తొమ్మిదోసారి తగ్గనున్న పెట్రోల్ ధరలు
అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు ఏకంగా 9 ఏళ్ల కనిష్టానికి పడిపోవటంతో, దేశీయ మార్కెట్లో కూడా చమురు ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. గడచిన ఆగస్ట్ 2014 నెల నుంచి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఇప్పటి వరకూ 8 సార్లు పెట్రోల్ ధరను తగ్గించారు. తాజాగా మరోసారి తగ్గింపును ప్రకటించినట్లయితే, ఇది 9వ సారి అవుతుంది.
గడచిన డిసెంబర్ నెలలో చమురుకు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరను లీటరుకు రూ.2 చొప్పున తగ్గించారు. వాస్తవానికి ఈ ఏడాది ఆరంభంలోనే ఇంధన ధరలను తగ్గించాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వం అలా చేయకుండా ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. ఈ ఎక్సైజ్ సుంకం పెంపు ద్వారా వచ్చిన మొత్తాన్ని భారత్లో రోడ్ నెట్వర్క్ని అభివృద్ధి చేసేందుకు ఉపయోగించాలని భావిస్తున్నారు.
జనవరి నెల ప్రారంభంలో పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.2 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకంటింది. ఈ పెంపు వలన పెట్రోల్, డీజిల్ రీటైల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచడంతో, గడచిన నవంబర్ 2014 నుంచి వరుసగా మూడు సార్లు ఈ సుంకాన్ని పెంచినట్లయింది.



Click it and Unblock the Notifications








