వోలా క్యాబ్లో షేర్లు కొన్న రతన్ టాటా
ప్రముఖ దిగ్గజ టాటా మోటార్స్ ఛైర్మెన్ రతన్ టాటా, భారత్లో ప్రసిద్ధి గాంచిన వోలా క్యాబ్లో షేర్లను తన సొంతంగా కొన్నారు. ఈయన ఈ మధ్య కాలంలో కొన్ని కొత్త కంపెనీల షేర్లు కొనుగోలుచేశారు.
కనపరచని మొత్తంలో ఆయన ట్యాక్సీ సర్వీసుల షేర్లను కొనుగోలుచేశారు. ఇది 2015 జూలై 1వ తేదీన దృవీకరించబడింది. రతన్ టాటా తన సొమ్మును వోలా క్యాబ్ సర్వీస్లో ఇన్వెస్ట్ చేశారు.

వోలా ఇండియాలోనే అతి పెద్ద ఆన్లైన్ క్యాబ్ సర్వీస్. ఇది ఉబర్ వంటి కంపెనీలతో పోటి పడుతోంది. వోలా ఇటీవల టాక్సీఫర్షూర్ కంపెనీని 200 మిలియన్ యూఎస్ డాలర్లకు కొనుగోలుచేసింది. ఆ సెగ్మెంట్లోని ప్రతి దానిని ఓడించాలని అది ప్రయత్నం చేస్తోంది.
రతన్ టాటా కూడా వేరే ఇతర కంపెనీల్లో తన సొమ్మును ఇన్వెస్ట్ చేశారు. స్నాప్డీల్, క్సియోమి, వోలా వంటి కంపెనీలను ఆయన కొనుగోలుచేశారు. వాటిలో చాలా కంపెనీలు ఆయన వాటాను వెల్లడించలేదు.

వోలా క్యాబ్లు దేశంలోని చాలా నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. అవి కస్టమర్లకు కావలసిన చాలా రకాల వాహనాలను అందిస్తున్నాయి. ఇవి కంట్రోల్ ధరతో మంచి సర్వీసులను అందిస్తున్నాయి.
మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్ స్పార్క్.......


Click it and Unblock the Notifications








