భారత్ లో విడుదలకు ముందు సుజుకీ ఎస్-క్రాస్ పరీక్ష పూర్తీ
మారుతీ సుజుకీ తన మొదటి క్రాసోవర్ ను భారత్ లో విడుదల చేయబోతోంది. ఈ జపనీస్ ఆటోమెబైల్ తయారీ సంస్థ దానికి ఎస్-క్రాస్ గా నామకరణం కూడా చేసింది. ఇది తన ఎస్.ఎక్స్4 సెడాన్ నుంచి అభివృద్ధి చేసి భారత్ లో అందిస్తోంది.
భద్రత అన్నిటికంటే చాలా ముఖ్యమైనది. అందుకే అదనపు భద్రత కోసం అధిక డబ్బులు వెచ్చిస్తున్నారు. భారత్ లో విడుదలకు ముందు ఎస్-క్రాస్ ఏసియన్ ఎన్.సీ.ఏ.పీ చే పరీక్ష పూర్తీచేసుకుంది. భారత్ లో ఇక నుంచి ప్రతి మోడల్ విడుదలకు ముందు పరీక్షించబడాల్సి ఉంటుంది.
ఎస్-క్రాస్ 7-ఎయిర్ బ్యాగ్ లను 63 కిలోమీటర్ల వేగం వద్ద ఫ్రంట్ కొల్లీసియన్ టెస్ట్ ను తీసుకుంది. ఇందులో ఈ జపనీస్ ఆటోమెబైల్ తయారీ సంస్థ
పెద్దలను సంరక్షించడంలో 5-స్టార్ రేటింగ్, పిల్లలను సంరక్షించడంలో 4-స్టార్ రేటింగ్ ను పొందింది.
మారుతీ సుజుకీ తన ఎస్-క్రాస్ ను మనేసార్ ఫెసిలిటీ వద్ద అసెంబ్లింగ్ చేస్తోంది. బేస్ మోడల్ లో కొన్ని భద్రతా పరికరాలు లేనప్పటికీ అదనపు ధరతో ఈ సౌకర్యాలను కల్పిస్తోంది. ఎస్-క్రాస్ పరీక్షను వీడియో ద్వారా వీక్షించండి. మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్ స్పార్క్.......


Click it and Unblock the Notifications








